సింగపూర్ ప్రధానితో మాట్లాడిన ప్రధాని మోదీ

  • టెలిఫోన్‌లో మాట్లాడుకున్న ఇరు దేశాల అధినేతలు
  • కరోనాతో ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై చర్చ
  • ప్రధాని కార్యాలయం వెల్లడి
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సింగపూర్  ప్రధానమంత్రి  లీ హెసైయన్ లోంగ్‌తో చర్చలు జరిపారు. వీరిద్దరూ నిన్న టెలీఫోన్‌లో మాట్లాడుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇరు దేశాల్లోని ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై ఇద్దరు నేతలు తమ ఆలోచనలు పంచుకున్నారు. ఈ విషయాన్ని భారత ప్రధాని కార్యాలయం వెల్లడించింది. సింగపూర్ లో ఇప్పటిదాకా 11,178 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. వారిలో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు.


Narendra Modi
telephone
conversation
Prime Minister
singapor

More Telugu News